Monday, December 21, 2015

శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళి, కపిర గిరీశా ! భాగ్య పురీశా !!, శ్రీ కనకమహాలక్ష్మి ఇంకా...

ఇప్పటి తరం పిల్లల్లో తెలుగు భాష, సంస్కృతులపైన తగ్గిపోతున్న మక్కువను, మళ్ళీ వాళ్ళలో పెంపొందించజేసే కార్యక్రమాలను నిర్వహించడం ఆశయంగా స్థాపిస్తున్న సంస్థ ' శిరావేదిక '. భావితరాలలో మాతృభాషా వికాసానికి కృషి చెయ్యడమే ఈ సంస్థ లక్ష్యం. ప్రారంభోత్సవ కార్యక్రమంగా ఈ డిసెంబర్ నెల 27 వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని ఉన్నత పాఠశాల స్థాయి పిల్లలకు ' తెలుగు పద్య పఠన పోటీ ' నిర్వహించి,10 మంది విజేతలకు డా. సుసర్ల గోపాలశాస్త్రి గారి స్మారక పురస్కార ప్రదానం జరుగుతుంది. శిరావేదిక మరియు శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంయుక్త అధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విశాఖపట్నం లో వున్నవారు, ఆ సమయానికి విశాఖపట్నం వచ్చే అవకాశం వున్నవారు తప్పక హాజరై చిన్నారులను ప్రోత్సహించి, ఆశీర్వదించవలసిందిగా మనవి. తేదీ & సమయం : 27 డిసెంబర్ 2015 - పోటీ : మధ్యాహ్నం గం. 2.30 ని. ల నుండి., సభ : సాయింత్రం గం. 6.30 ని. ల నుండి
వేదిక : శ్రీకృష్ణ విద్యామందిర్, తిలక్ షోరూమ్ ఎదురుగా, ద్వారకానగర్, విశాఖపట్నం
వివరాలకు : siravedika@gmail.com  మొబైల్ : 9440483813
శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళి, కపిర గిరీశా ! భాగ్య పురీశా !!, శ్రీ కనకమహాలక్ష్మి ఇంకా... ఈ క్రింది లింక్ లో

శిరాకదంబం 05_009
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 009

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం