Saturday, July 25, 2015

బృహస్పతి అష్టోత్తరమ్... తుంగభద్ర... ప్రాతః స్మరణీయుడు... ఇంకా


గోదావరికి మహా పుష్కరాలు మహా వైభవంగా జరిగాయి. పుష్కరానికి, బృహస్పతికి అవినాభావ సంబంధం వుంది.
పుష్కరాల నేపథ్యంలో బృహస్పతి అష్టోత్తర నామావళి, పుష్కర సమయంలో ఇవ్వవలసిన దానముల గురించి వివరణ.....


మన దేశానికి స్వాతంత్ర్యము సిద్ధించిన తొలినాళ్లలో సాహిత్యం  కొంతకాలం ప్రభావితమయింది.  మన జీవితాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  నదులతో పెనవేసుకుని వుంటాయి. అందుకే నదీమతల్లిని మన ప్రజలు అంత భక్తితో కొలుస్తారు. ఈ రెండు విషయాలను ముడివేసి అధ్బుతమైన ప్రేమ కథను ‘ జాతీయ విజ్ఞానం ‘ అనే పత్రిక 1948 జూన్ సంచికలో రావూరు వ్రాసిన కథ " తుంగభద్ర "........  

పాలకునికి దార్శనికత వుండాలి. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతాన్ని సరైన తీరులో అభివృధ్హి చేస్తే దేశానికే ధాన్యాగారం అవుతుందని, దానికి వృధాగా సముద్రంలోకి పోయే జలాలను ఒడిసి పట్టి పొలాలకు మళ్ళించడం కోసం ఎన్నో ప్రణాళికలు రచించి అమలు చేసి, కరువు కోరల్లో చిక్కుకున్న ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు కాటన్. ఆయన వర్థంతి సందర్భంగా " ప్రాతః స్మరణీయుడు సర్ ఆర్థర్ కాటన్ " ........  ఇంకా చాలా...... ఈ క్రింది లింక్ లో.....


" బాలల కథల పోటీ - 2015 " కి పొడిగించబడిన గడువు తేదీ 31 జూలై సమీపిస్తోంది. 
మీ పిల్లల్ని లేదా మీ బంధు మిత్రుల పిల్లల్ని ప్రోత్సహించి ఈ పోటీలో పాల్గొనేటట్లు చేయండి. భావి తరానికి భాషా వారసత్వాన్ని కూడా అందించండి. తెలుగు భాషను ఎప్పటికీ సజీవంగా వుంచడంలో మీ వంతుగా తోడ్పడండి. 

భవదీయుడు
శి. రా. రావు



​Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 06 Pub. No. 028

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం