Saturday, April 4, 2015

ఏ దేశమేగినా... మట్టి మనిషి - ఒక జ్ఞాపకం... విజయదర్శన్ రెండవ భాగం.... ఇంకా.....

తెలుగు భాష, సంస్కృతులు ఇంట గెలవడం మాట ఎలా వున్నా, రచ్చ గెలుస్తోంది అన్న విషయం విదేశాలలో వుంటున్న తెలుగు వారి కార్యకలాపాలు ఋజువు చేస్తున్నాయి. తెలుగు భాష, సంస్కృతుల వ్యాప్తికి ప్రవాసాంధ్రులు చిత్తశుద్ధితో చేస్తున్న కృషి అభినందనీయం. దీన్ని స్పూర్తి గా తీసుకున్నా మన దేశంలో తెలుగు వెలుగుతుందనడంలో సందేహం లేదు.
ఇటీవల మన్మథ ఉగాది వేడుకలను హాంగ్ కాంగ్ లో వుంటున్న తెలుగు వారు వైభవంగా జరుపుకున్నారు. స్థానిక చైనీయులకు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం కల్పించడం విశేషం. అంతే కాక చైనీయులకు కూడా తెలుగు భాషను నేర్పించడం మరింత విశేషం.
హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల గురించి, తెలుగు సమాఖ్య ప్రస్థానం గురించి ' ఏ దేశమేగినా... '
ప్రపంచలోని తెలుగు రచయితలను ఒకచోట చేర్చిన ' మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ' గురించి....
తెలుగు సాహితీ లోకంలో పది కాలాలపాటు చెప్పుకోగలిగే నవల డా. వాసిరెడ్డి సీతాదేవి గారి ' మట్టి మనిషి 'గురించి ఒక జ్ఞాపకం....
దూరదర్శన్ విజయదుర్గ గారి అంతరంగ దర్శనం ' విజయదర్శన్ ' రెండవ భాగం....
ఇంకా చాలా అంశాలు... ఈ క్రింది లింక్ లో ......
శిరాకదంబం 04_017 
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 020

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం