Tuesday, September 13, 2011

పోయినోళ్ళందరూ మంచోళ్ళు

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్లు 
ఉండమన్న వుండవమ్మా సాన్నాళ్ళు
పోయినోళ్ళందరూ మంచోళ్ళు 
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ..... 
**************************
మమతే మనిషికి బందిఖానా 
భయపడి తెంచుకు పారిపొయినా 
తెలియని పాశం వెంటపడి ఋణం తీర్చుకోమంటుంది..... 
**************************
తనువుకెన్ని గాయాలైనా  మాసిపోవునేలాగైనా 
మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా.... 
**************************
 చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు 
నాటకరంగానివే.... మనసా ! 
తెగిన పతంగానివే ! .....
************************** 
ఏమిటో ఈ ప్రేమ తత్త్వం 
ఎక్కడుందో మానవత్వం 
ఏది సత్యం ఏది నిత్యం 
చివరికంతా శూన్యం... శూన్యం....
**************************
వేసవిలోనూ వానలు రావా 
కోవెల శిలకు జీవం రాదా 
జరిగేనాడే జరుగును అన్నీ 
జరిగిననాడే తెలియును కొన్ని...... 
**************************.
తనకు తానూ సుఖపడితే ఒక ఆనందం 
తనవాళ్ళనైన సుఖపెడితే పరమానందం 
ఈ రెంటికినోచని జీవితం ఎండిపోని కన్నీటి సముద్రం....
**************************  
ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం 
ఏది నిజమౌ బంధం ? 
ఏది అనురాగం ఏది ఆనందం ? .....
**************************
పశువులుకన్నా పక్షులకన్నా 
మనిషిని మిన్నగా చేసాడు.....
........ 
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక 
నరుడే ఈ నరలోకం నరకం చేసాడు...... 
************************** 
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం 
అది తెలియకపోతే వేదాంతం......
************************** 
ఎవరు ఎవరికి తోడవుతారో
ఎప్పుడెందుకు విడిపోతారో 
.........
ఎవ్వరి పయనం ఎందాకో 
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ..... 
**************************
రానైనా రాలేను నిదురపోనైనా పోలేను 
నిశిరాతిరియైనా నీ పిలుపే నా ప్రియా 
అదే పూల గాలి ఆనాటిదే జాబిలీ ........
**************************
కళ్ళు వాకిట నిలిపి చూసే 
పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో.....
**************************
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది 
పాలు తాగి మనిషి విషమవుతాడు
అది గడ్డి గొప్పతనమా 
ఇది పాల దోషగుణమా ?......
**************************
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు 
మగవాడిని నమ్మడం మనిషి చేయడం 
మనసు నిదరలేపడం మమత నింపడం.....
**************************
 జాబిల్లి వెన్నెల్లు చవి చూడలేదు 
 సిరిమల్లె సిగ ముడువలేదు.......
**************************
మనసు మాసిపోతే మనిషే కాదని 
కాటికి రాయికైనా కన్నీరుందని......
**************************
కలిమిలేమి జంటలని 
అవి కలకాలంగా ఉన్నవని 
రుజువు చేయమని 
మన ఇద్దర్నీ కాలం నేటికి కలిపేనని.....
**************************
పసిపాపవలె ఒడి చేర్చినాను 
కనుపాపవలె కాపాడినాను..... 
**************************
చంపేది ఎవడురా ? చచ్చేది ఎవడురా ? 
శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదురా !
 **************************


........ ఈ ఆణిముత్యాలను పాటలలో పొదిగిన కవి ఆత్రేయ. సినిమా పాటకు గ్లామర్, గ్రామర్ లను కూర్చిన కవి ఆత్రేయ. 

" తెల్లారేలోపు వెళ్ళాలి జగతి విడిచి 
వెలుగులో ఈ జగతి చూస్తే వెళ్ళను.. కాళ్ళాడవు "



 ....... అంటూ ' వెళ్తున్నాను ' అనే కవిత చెప్పి 1989 సెప్టెంబర్ 13 న వెళ్ళిపోయిన ఆత్రేయ గారికి ఈ కదంబంతో నివాళులు అర్పిస్తూ ....... 





 Vol. No. 03 Pub. No. 032

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అద్భుతమైన మాటలతో పాటలు!

SRRao said...

మందాకిని గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం